Kumbhabhishekam : న్యూ జెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ గురువాయురప్పన్ టెంపుల్, శ్రీ కృష్ణ మందిర్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ‘జీర్ణోద్ధరణ కుంభాబిషేకం’ ఘనంగా నిర్వహించారు. న్యూ జెర్సీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి హిందువులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఆగమ సంప్రదాయం ప్రకారం.. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి ఆలయాన్ని పునఃప్రతిష్ట చేయడం అవసరం. ఆలయ పవిత్రత కొనసాగాలంటే ఈ సంప్రదాయం పాటించాలి. ఆలయంలోని రాతి పీఠాలకు, విగ్రహాలను ఉన్న శక్తి కూడా 12 సంవత్సరాలకు తగ్గుతూ వస్తుంది. ఆ సమయంలో ఆలయాన్ని పునర్ నిర్మించే ముందు అవసరమైన ఇతర పూజలు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్ఏటీసీసీ పేర్కొంది.
జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా జూలై 3 నుంచి జూలై 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. జూలై 3వ తేదీ ఉదయం 6.30 గంటలకు సుప్రభాత సేవతో మొదలైన సేవలు, పూజలు, అభిషేకాలు రాత్రి వరకు కొనసాగాయి. ఇక 4వ తేదీ గోసేవతో ప్రారంభం కాగా.. 9 గంటలకు యాగశాలలో మహాగణపతి హోమం నిర్వహించారు. 5వ తేదీ గోపూజ, 9 గంటలకు యాగశాలలో సుదర్శన హోమం, సాయంత్రం 5.30 గంటలకు పార్వతీ స్వయంవర కథ హోమం నిర్వహించారు. 6వ తేదీ ఉదయం 8 గంటలకు గోపూజతో ప్రారంభమైన పూజలు 9 గంటలకు ధన్వంతరీ హోం, సాయంత్రం 5.30 గంటలకు మహా మృత్యుంజయ హోమం జరిగింది. 7వ తేదీ ఉదయం 7 గంటలకు గోపూజతో ప్రారంభమైన పూజలు సాయంత్రం 4 గంటలకు హారతి, ప్రసాద వితరణతో ముగిశాయి.
న్యూ జెర్సీలోని హిందువులే కాకుండా అమెరికా, భారత్ నుంచి ప్రముఖులు, గొప్ప గొప్ప పండితులు ఈ జీర్ణోద్ధరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు సాగిన పూజా కార్యక్రమల్లో పాల్గొన్ని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : Guruvayoorappan Temple Srikrishna Mandir Morganville NJ