
Raj Tarun : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రాజ్ తరుణ్-లావణ్య-మాల్వీ మల్హోత్రా ప్రేమ వ్యవహారమే. ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడంటూ లావణ్య వీధి కెక్కి పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కే వరకు వెళ్లింది. లావణ్య, మాల్వీ మల్హోత్ర మధ్య జరిగిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం వినిస్తుంది. లావణ్య నార్సింగ్ పీఎస్ లో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసింది. సదరు ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించింది.
లావణ్య కథనం ప్రకారం.. ‘రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడు. మీమిద్దరం ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాం. ఇద్దరి మధ్య లైంగిక సంబంధం కూడా ఉంది. ఓ గుడిలో నన్ను వివాహం కూడా చేసుకున్నాడు. 3 నెలల క్రితం లావణ్య-రాజ్ తరుణ్ ఉంటున్న ఇంటి నుంచి సడెన్ గా రాజ్ తరుణ్ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనను వదిలించుకోవాలని అనుకుంటున్నాడు.’ అని చెప్పింది.
‘ఇకపై నా జోలికి రావద్దని నన్ను బెదిరించాడు. చంపి, శవం మాయం చేస్తానని భయపెట్టాడు. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించింది కూడా రాజ్ తరుణే. ఆ కేసులో 45 రోజులు జైలులో కూడా ఉన్నాను. అప్పుడు కూడా రాజ్ నన్ను పట్టించుకోలేదు.’ అని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ తనకు కావాలంటున్న లావణ్య, న్యాయం చేయాలని పోలీసులను కోరింది. నార్సింగ్ పోలీసులు లావణ్య కేసును విచారిస్తున్నారు.
లావణ్య ఆరోపణలను రాజ్ తరున్ ఖండిస్తున్నాడు. ఆమెతో లివ్ ఇన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ, విడిపోయి చాలా కాలమైంది. డ్రగ్స్ తీసుకొని నన్ను టార్చర్ పెట్టింది. బ్లాక్ మెయిల్ చేసింది. లీగల్ గానే ఈ కేసును ఎదుర్కొంటానన్నాడు.
రాగా గతంలో మాల్వీ మల్హోత్రా-లావణ్యకు మధ్య మొబైల్ లో మాటల యుద్ధం జరిగింది. ఈ ఆడియో సంభాషణను లావణ్య రీసెంట్ గా రిలీజ్ చేసింది. సదరు ఆడియోలో.. రాజ్ తరుణ్ ను వదిలేయ్, నీ కాళ్లు పట్టుకుంటానని లావణ్య మాల్విని కోరింది. నీతో లివ్ ఇన్ లోకి వచ్చాక నన్ను వదిలేశాడు. నువ్వు ఏం చెప్తే అది చేస్తున్నాడు. నా నెంబర్ బ్లాక్ చేశాడు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు కెరీర్ లో ఎదగలేరని మాల్వి లావణ్యను హెచ్చరించింది. ఈ ఆడియో రికార్డు వైరల్ అవుతుంది.