
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే వస్తున్నారు. నేడు పుష్య పౌర్ణమి కావడంతో ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వద్ద వారు పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగ నీరు చల్లగా ఉన్నప్పటికీ తమ మనసులు వెచ్చదనంతో నిండాయని అంటున్నారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, పోర్చుగల్, జర్మనీ, సౌతాఫ్రికా నుంచి వచ్చిన కొందరు మీడియాతో మాట్లాడారు. యోగా, మోక్షం, పుణ్యం, ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి గురించి చెప్తున్నారు.
కుంభమేళాలో భక్తజన సంద్రం..
యూపీలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాల్టి నుంచి 45 రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే.