భారతదేశం ఒకప్పుడు విశ్వగురువు. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన దేశం. ఇప్పుడు మళ్లీ ఆ దశకు చేరుకుంటుంది. దీనికి ముఖ్యంగా భారత్ అనుసరిస్తున్న దౌత్యనీతి మాత్రమే కారణం. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఏ విధంగా చూస్తారని గతంలో భారత్ ను అడిగితే తాము శాంతికే మొగ్గు చూపుతామని, కానీ రష్యాకు మాత్రం వ్యతిరేకం కాదని చెప్పి దౌత్య నీతిని ప్రదర్శించింది. ఇదే కాకుండా ఆర్టికల్ 370 ఎత్తివేసిన సమయంలో కూడా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కొట్లాడుతున్న సమయంలో ఏ దేశం కూడా పాక్ వైపు మొగ్గు చూపకుండా చేయగలిగింది ఇండియా. ఇలా చెప్పుకుంటూ పోతే దౌత్య నీతిలో భారత్ అనుసరిస్తున్న విధానం ప్రపంచలోని ఏ దేశం అనుసరించలేదు.
భారత్ దౌత్య నీతిపై విదేశాంగ మంత్రి జై శంకర్ ను ఒకరు ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు. విదేశాంగ వ్యవహారం అనేది మన పురాణాల్లో నుంచి వచ్చిందని చెప్పారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా అర్జునుడిని గెలిపించాడు. అదే శ్రీ కృష్ణుడు యుద్ధం వద్దని కూడా చెప్పాడు. కానీ కౌరవులు వినకుండా చేస్తాం చెప్పడంతో తను వెనక ఉండి పాండవులతో కురు సామ్రాజ్యాన్ని పడగొట్టాడు. అక్కడ దౌత్య నీతి ఉంది. దీంతో పాటు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయిన సందర్భంలో హనుమ వెళ్లి చూసి వస్తాడు. చూసి వస్తున్న సమయంలో రావణుడికి నాలుగు మంచి మాటలు చెప్తాడు అయినా ఆయన వినకపోవడంతో లంక పతనం అవుతుంది.
ఇలా చాణక్యుడి గురించి తీసుకున్నా మనకు తెలుస్తుంది. నందులు చాణక్యుడిని అవమానించగా. ఆయన శపథం పన్నాడు. చంద్రగుప్తుడిని రాజును చేసేందుకు తన పన్నాగాలు పన్నాడు. ఇలా చాలానే కథలు మన పురాణాల్లోనే ఉన్నాయని చెప్పాడు విదేశాంగ మంత్రి జైశంకర్. అయితే ఎక్కడైనా నీతి మాత్రమే గెలుస్తుందని, మన గ్రంథాల్లో ఉన్న మహా పురుషులు వినాశంను తప్పించేందుకే ప్రయత్నిచారు కానీ వారు వినాశకారులు కాలేదన్నారు. దీనిపై సభలో చప్పట్ల వర్షం కురిసింది.