మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భోళా శంకర్”.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచింది.. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు..
మరి ఈ వేడుకలో హైపర్ ఆది కూడా పాల్గొనగా ఈయన స్పీచ్ నెట్టింట వైరల్ అయ్యింది. హైపర్ ఆది మాట్లాడుతూ.. ముప్పై ఏళ్లుగా యుద్ధ భూమిని ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్రసేనాని అయితే తమ్ముడేమో జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు..
బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్.. ఆస్తులు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించారు.. ప్రతీ ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు కానీ మెగాస్టార్ ఫ్యాన్ మాత్రం ఉంటారు..
ఇక టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నాడు.. ఆయనను అనే స్థాయి నాకు లేదు.. అలాగే మెగాస్టార్, పవర్ స్టార్ ను అనే స్థాయి కూడా ఆయనకు లేదు.. చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ ను విమర్శిస్తుంటారు.. అలాంటి అర్ధంలేని మాటలకూ క్లాప్స్ రావు.. మీ వ్యూహాలన్నీ బెడిసి కొడతాయంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి..