Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరనున్నారు. మంగ ళవారం నాడు.. ఆళ్ల సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిసే అవకాశ మున్నట్లు తెలియవచ్చింది. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరి పారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకా ర్యదర్శి నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా తాడేపల్లి పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్కే మళ్లీ పార్టీలోకి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుం దని పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగ ళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధిం చా రు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్పై విజ యం సాధించారు. అయితే రెండో సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు.
తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.