34.1 C
India
Saturday, April 20, 2024
More

    భారత్ వైపే వాళ్ల చూపు అంటున్న మోదీ.. ఎవరంటే..

    Date:

    Modi says
    Modi says

    మూడు దేశాల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కాసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. జపాన్, పూనువా నూగినియా, అస్ర్టేలియా దేశాల పర్యటనను ముగించుకొని ఆయన స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ శ్రేణులు ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అయితే ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆస్ర్టేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించానని, ఈ అంశాన్ని ఆదేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. భారతీయ సంస్కృతిని తెలిపే ఆలయాలపై దాడులను ప్రధాని ముందే ఖండించానని తెలిపారు. మన దేశం యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. అందుకే మనదేశం వైపే ప్రపంచ దేశాల చూపు ఉందని చెప్పుకొచ్చారు. భారత్ గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి శాంతికాముకులు పుట్టిన నేల అని తెలిపారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులంతా తరలిరావడం గొప్పగా అనిపించిందని, అది మనదేశ గొప్పతనమని తెలిపారు. .

    కార్యక్రమంలో భాగంగా జేపీ నడ్డా, సుబ్రహ్మణ్య జైశంకర్ మాట్లాడుతూ పవూవా న్యూగినియా ప్రధాని మన దేశ ప్రధాని మోదీకి పాదనమస్కారం చేయడం మన దేశానికి దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. మోదీని అంతా విశ్వ గురువుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అస్ర్టేలియా ప్రధాని కూడా స్వయంగామోదీని ది బాస్ అని సంబోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    Share post:

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    SRH Vs DC : సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పై పెరిగిన అంచనాలు

    SRH Vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    DK Shivakumar : కర్ణాటకలో మోడీ వేవ్ లేదు:  డిప్యూటీ సీఎం DK శివకుమార్

    DK Shivakumar : తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని...

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...