
Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించడం పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్న నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగువారి గౌరవాన్ని దేశ రాజధాని వేదికగా మరింత ఇనుమడింపజేయనున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు, నందమూరి అభిమానులకు, సమస్త తెలుగు ప్రజలకు గర్వకారణం. ఈ పురస్కారం ఆయన సినీ ప్రస్థానంలో, ప్రజాసేవలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.