
NDA Victory 2024 Celebrations at Royal Albert Palace : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మోడీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులు ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ పేరుతో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించింది. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో అఫ్ బీజేపీ అమెరికా (OFBJP-USA ) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో OFBJP ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులు (key note speakar)గా డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలో 800 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు.
డోల్ తాషా ప్రదర్శనతో పాటు.. ఎన్నారైల నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అడపా ప్రసాద్ మాట్లాడుతూ 1962 తర్వాత మొదటి సారిగా మూడో సారి ఒకే ప్రధాని నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైందని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ నాయకుడు కూడా ప్రజల మద్ధతుతో మూడో సారి ఎన్నుకోబడలేదని ఆ క్రెడిట్ ఒక్క మోడీకే దక్కుతుందన్నారు. దీనితో పాటు ఏపీలో కూటమి విజయాన్ని కూడా ఆయన అభినందించారు. ఈయనతో పాటు డా. సుధీర్ పారిఖ్, ఆల్బర్ట్ జెస్సాని, మియూష్ పటేల్ ప్రభుత్వ విజయాలున ప్రశంసించారు.

భారత ప్రధానిగానే కాకుండా గ్లోబల్ లీడర్ గా ప్రపంచ పెద్దన్నగా మోడీకి గుర్తింపు ఉందన్న జగదీష్ గారు రాబోయే ఐదేళ్లు దేశంలో యువతను వినియోగించుకొని భారీ మార్పులు చేసేలా ప్రణాళికలు పెట్టుకున్నారన్నారు. మోడీకి చంద్రబాబు తోడయ్యాడని ఇద్దరి కాంబో ప్రపంచానికే మేలని జై గారు అన్నారు. చంద్రబాబు కేబినెట్ పూర్తి స్థాయిలో కొలువు దీరిందన్న జై గారు అర్హత, యువతను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు శాఖలు కేటాయించిన తీరు అమోఘం అని కీర్తించారు.
ఇటలీలో జరుగుతున్న G7 సదస్సుకు మోడీని పెద్దన్నగా ఆహ్వానించడం ప్రపంచం యావత్తు భారత్క ఇస్తున్న గౌరవంగా భావించాలన్న జగదీష్ బాబు గారు. అసలు G7లో భారత్ లేదని అయినా గుర్తింపు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఏ కఠినమైన నిర్ణయం తీసుకోవాలన్నా ప్రపంచం యావత్తు నేడు భారత్ వైపునకే చూస్తుందని, దీనికి కారణం ఒకే ఒక వ్యక్తి మోడీ అన్నారు. దేశంలో ప్రతీ రంగాన్ని ఆయన పైకి తీసుకువచ్చారని అందుకే నేడు ఇండియా ఎకానమీలో ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకిందని జై అన్నారు.
కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుధీర్ పరేఖ్, శ్రీ జయేష్ పటేల్, శ్రీమతి వంటి ప్రముఖ కమ్యూనిటీ నాయకులు, వలంటీర్లు సహా న్యూజెర్సీలోని ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, దీప్తి జానీ, మా రాజ్యలక్ష్మి, సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, గణేష్ రామకృష్ణన్, శివదాసన్ నాయర్, గోవిందరాజ్, జయశ్రీ, ఓంప్రకాష్ నక్క, రఘురెడ్డి, ప్రవీణ్ తడకమళ్ల, రామ్ వేముల, విజయ్ కుందూరు, శ్రీనివాస్, శ్రీ శరత్ వేముల, శ్రీకాంత్ రెడ్డి, గనగోని, పృథ్వీ, రవి పెద్ది, మధు అన్న, భాస్కర్, నాగ మహేందర్, దాము గాదెల, సుధాకర్ ఉప్పల, మృధుల, లక్ష్మీ మోపర్తి, ప్రవీణ్ గూడూరు, గురు ఆలంపల్లి, గోపీ, ఇంకా చాలా మంది కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajay Tv & JSW Tv Global Director)
More Images : NDA Victory 2024 Celebrations at Royal Albert Palace