సుకుమార్ డైరెక్షన్ రూపుదిద్దుకున్న పుష్ప1 ఏ స్థాయిలో విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. మొదట టాలీవుడ్ పరిధిలోనే విడుదల చేసిన మైత్రీ మేకర్స్ సినిమాకు వచ్చిన హైప్ ను చూసి పాన్ ఇండియా లెవల్ లో రిలీజై సత్తా చాటుకుంది. ఇక పుష్ప2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు Niharika కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో మంచి విలువలు పాటిస్తున్నాడు సుకుమార్. రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో నిహారిక కొణిదెల కూడా నటిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అడవిలోకి వెళ్లిన పుష్పకు ఓ కోయజాతికి చెందిన పిల్లగా ఆమె కనిపించనుందని, ఆమె పాత్రకు కూడా మంచి హోప్ ఉందని తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంత వరకూ అధికారికంగా ప్రకటించలేదు.
ఫహాద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్, రావు రమేశ్, యాంకర్ అనసూయ, దనుంజయ్ ఇతర పాత్రల్లో నటిస్తూ మెప్పించనున్నారు. సుకుమార్ తో వర్క్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తారని తెలుస్తోంది. ‘అల వైకుంఠపురం’ వీరి కాంబోలోనే వచ్చింది. పుష్ప2 పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
త్రివిక్రమ్ సినిమా ముగియగానే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో మరో సినిమాకు కమిట్ అయ్యాడట అల్లు అర్జున్. ఈ సినిమాను టీ-సిరీస్ నిర్మిస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు ముగియగానే స్టయిలిస్ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బన్నీ. వీరి కాంబోలోనే గతంనలో రేసుగుర్రం వచ్చింది.
పుష్ప రెండు పార్టులతో కాకుండా మూడో పార్టు కూడా ఉండబోతోందని టాక్ వినిపిస్తుంది. పుష్ప2ను ఒక భారీ ట్విస్ట్ తో ముగించాలని దర్శకుడు అనుకుంటున్నారట. పుష్ప3 పూర్తిగా పుష్పకు ది ఎండ్ వేస్తారని తెలుస్తోంది. కథ కూడా రెడీ అయినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటుందగా షూటింగ్ కూడా 2025లో ప్రారంభిస్తారట. సందీప్ రెడ్డి వంగా సినిమా తర్వాత ఉండవచ్చు.
Where is Pushpa Raj
వేరీజ్ పుష్ప అంటూ అల్లు అర్జున్ బర్త్ డే రోజు రిలీజ్ చేసిన గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది. డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడు పుష్ప. వైజాగ్ లో షూటింగ్ ముగించుకొని రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చారు చిత్ర యూనిట్. అయితే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. పుష్ప-ది రూల్ హక్కులను ఇప్పటికే (అన్ని భాషలు, శాటిలైట్స్ తోకలిసి) రూ. 900 కోట్లకు ఆఫర్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సెకండ్ పార్ట్ ను రూ. 350 కోట్లతో తెరకెక్కించనున్నారు.