
Prabhas warning : ప్రభాస్ రాముడిగా కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఆదిపురుష్. దీని విషయంలో మొదటి నుంచి వివాదాలే చుట్టుముడుతున్నాయి. రామాయణం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించి కావడంతో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని ప్రభాస్ చెబుతున్నా దర్శకుడు ఓం రౌత్ మాత్రం పట్టించుకోలేదు.
పండితులు, సంప్రదాయ వాదులు, భక్తులు ఇలా ప్రతివారికి ఇది ఎంతో ప్రీతికరమైన గ్రంథం. అందుకే దాని విషయంలో మనం సరిగా ఉండకపోతే విమర్శలు రావడం ఖాయం. అందుకే దీని విషయంలో మరోమారు పరిశీలించుకోవాలని ప్రభాస్ చెప్పినా నేనున్నాను ఏం కాదని ఓం రౌత్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
రామాయణం కావడంతోనే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా దర్శకుడు మాత్రం నిర్లక్ష్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల షూటింగ్ అనంతరం తాను జరుగుతున్న తప్పును గ్రహించిన ప్రభాస్ కథ తప్పుగా వెళ్తోందని చెప్పినా పట్టించుకోలేదు. ఓం రౌత్ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ప్రభాస్ చెప్పినా పెడచెవిన పెట్టారని టాక్.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమ గురించే చర్చించుకుంటున్నారు. యువతరం సినిమా నిర్మాణం గురించి తప్పుబడుతున్నారు. ఓం రౌత్ పద్ధతి బాగా లేదని పెదవి విరుస్తున్నారు. రామయణం అంటే అందరికి గౌరవం ఉంటుంది. అలాంటి కథను ఇష్టమొచ్చినట్లుగా మార్చడంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.






