
AP CM Chandrababu Naidu Birthday Celebrations : ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది విజన్, నిరంతర శ్రమ, నూతన ఆలోచనలు, ప్రజాపక్ష నాయకత్వం. ఇటువంటి గొప్ప నాయకుడి 75వ జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ గర్వకారణం మాత్రమే కాకుండా, ఒక ప్రేరణగానూ నిలుస్తుందని యూబ్లడ్ ఫౌండర్ డా. జై జగదీష్ బాబు యలమంచిలి గారు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా బాబు గారి సేవలను డా.జై గారు గుర్తు చేసుకున్నారు.
డా. జై గారు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు గారు తన జీవితం మొత్తం ప్రజల సంక్షేమానికే అంకితమిచ్చారు. రాష్ట్రానికి మరియు దేశానికి ఆయన అందించిన సేవలు తులనలేనివి. ఐటీ విప్లవాన్ని తెచ్చిన నేతగా, హైటెక్ హైదరాబాద్ రూపుదిద్దిన పాలకుడిగా, రైతుల అభివృద్ధికి పాటుపడిన పథదర్శిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.నాయకత్వంలో ఆయన చూపిన స్పష్టత, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చూపిన వ్యూహాత్మక ఆలోచన – ఇవన్నీ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాయి. ఆయన పాలనలోనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లాయి. వ్యవసాయం నుంచి టెక్నాలజీ దాకా ప్రతి రంగంలో ఆయన తన ముద్ర వేశారని జై గారు అన్నారు.
నా వ్యక్తిగత జీవన ప్రయాణంలో చంద్రబాబు గారు ఒక వెలుగురేయి అని డా. జై గారు అన్నారు. . రాజకీయాల్లో నేను తీసుకున్న ప్రతి అడుగులో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. నాయకత్వం అంటే ఏమిటి? ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఎలా ఉండాలి? పాలనలో దృఢమైన విలువలు ఎలా పాటించాలి? అన్నదానికి నాయుడు గారి జీవితం ఒక పాఠశాల లాంటిదని కొనియాడారు.
75 ఏళ్ల వయస్సులో కూడా ఆయన చూపుతున్న ఉద్వేగం, పట్టుదల, ప్రజల కోసం చేసే కృషి నిజంగా విస్మయకరం. ఉదయం లేవగానే రాష్ట్ర సమస్యలపై ఆలోచనలు, మధ్యాహ్నం నిర్ణయాలపై సమాలోచనలు, రాత్రి విశ్రాంతికి ముందు భవిష్యత్ ప్రణాళికలు – ఆయనలోని పట్టుదల చూసి నేనూ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.
ఈ ప్రత్యేక సందర్భంగా, చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో కలసి, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చూపించిన మార్గంలో ఎన్నో తరాలు నడుస్తూ, సమాజానికి వెలుగునివ్వాలని డా.జగదీష్ బాబు యలమంచిలి గారు ఆకాంక్షించారు..
జయహో చంద్రబాబు!
జయహో విజన్!