
Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపిందని, దానికి షాక్ అయ్యి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొన్ని వేదికల్లో షబాజ్ షరీఫ్ తీవ్ర ఒత్తిడితో ఆసుపత్రిలో చేరారని కథనాలు స్పష్టంగా చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం, భారత్ తీసుకున్న విధానాత్మక, వ్యూహాత్మక చర్యల వలన పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొనబడింది. అదే సమయంలో షరీఫ్ ఆరోగ్యం నిలకడగా లేక ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారిక వర్గాల నుంచి కూడా ఇప్పటివరకు ఏ విధమైన స్పందన రాలేదు.
ఇకపోతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రజలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. పాక్ ప్రధాని ఆరోగ్య పరిస్థితి నిజంగా విషమించిందా? లేదా ఇది కేవలం ప్రచారమేనా అన్నది తేలాల్సిన విషయమే.