
Anna canteen in AP : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకువచ్చిందని అనేకమార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటిన్లు తిరిగి ఓపెన్ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఆ దిశగా తొలి అడుగు పడింది.
ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తన 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు.. తన నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు.
హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ.. 3వ సారి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు.