
నేను ఏపీ లోకి ఎంటర్ అయ్యా ఇక సూస్కో నా తడాకా అంటున్నాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అనీ సవాల్ విసురుతున్నాడు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి లేని రాజ్యం అందరికి అధికారం దక్కుతుంది అనీ అంటున్నారు. ఇప్పుడు అధికారం కొన్ని కులాల చేతుల్లో ఉందని, రెడ్డి, నాయుడు, వైశ్య, వెలమ కమ్యూనిటీ కమ్మ్యూనిటి ప్రజలు కూడా పాల్ రావాలి పాలనా మారాలి అంటున్నారన్నారు.. పాలనా మారడం అంటే కుటుంబ పాలన పోవాలి. కుల పాలనా పోవాలని వారు కోరుకుంటున్నారు.
ఏపీ 9 లక్షల అప్పు ఉందని ఇంకో ఏడాది లో అది 10 లక్షల కోట్లకు చేరుతుందని నేను అధికారంలోకి వస్తేనే ఆ అప్పు తీరుతుంది.వైజాగ్ స్టిల్ ప్లాంట్ అమ్మకుండా అమెరికా, మేక్ససికో ఉన్నా… నా లాయర్ ను పెట్టి కోర్ట్ లో కేసు వేసానని, ఆ కేసు గెలుస్తున్నామన్నారు. నన్ను చూసే జేడీ లక్ష్మినారాయణ కేసు వేసాడు.. ఆయనకి కూడా నా లాయర్ ను పెట్టాను అన్నారు.
నేను పెట్టిన శాంతి సభలకే నైజిరియాలో 70 లక్షల మంది హైదరాబాద్ లో 10,20 లక్షల మంది ఏపీ లో 30 లక్షల మంది హాజరయ్యారన్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యినప్పటి నుంచి నాకు పరిచయమన్నారు. నేను ఏపీకి ఎన్ని కోట్లు తెచ్చి అభివృద్ధి చేసానో ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు చెయ్యనివ్వడం లేదు అనీ ప్రశ్నించారు. ఎందకంటే పాల్ వస్తే వాళ్ళ ఆటలు నాగనివ్వను అనీ వాళ్లకు తెలుసు అందుకే నన్ను అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటురన్నారు.
ప్రజాశాంతి పార్టీలోకి ఐర్ఎస్ లు, ఐఫ్ఎస్ లు, ఐఏఎస్ లు చేరుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాతో కలిసి రావాలని, బీజేపీ తో మనకేంటి పని స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ తో మనకు పని లేదని అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా… సోనియా, చంద్రబాబు లనే హెలికాప్టర్ లో తిప్పిన నాకు ఏపీని అభివృద్ధి చెయ్యడం పెద్ద పనా ఏంటి పాల్ అన్నారు.






