
Singanamala Ramesh : ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన నిర్మాతగా తీసిన ‘కొమరం పులి’ (పవన్ కళ్యాణ్) , ‘ఖలేజా’ (మహేశ్ బాబు) సినిమాల వల్ల భారీ నష్టం చవిచూశారని, కానీ హీరోలు కనీసం సానుభూతి కూడా చూపలేదని అన్న మాటలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా నిర్మాణం వ్యాపారం కంటే ఎక్కువగా గ్యాంబ్లింగ్ లాంటిదని, కొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ అవుతాయి, మరికొన్ని అంచనాలు తలకిందులు చేస్తాయని గతంలో చాలా మంది నిర్మాతలు చెప్పిన విషయం. అయితే, తనను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలయ్యేలా చేసారని రమేష్ గారు ఆరోపించడం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నిర్మాతను తొక్కేసింది ఎవరు? జైలుకు పంపింది ఎవరన్నది ఆసక్తి రేపింది.
ఇదంతా నిజమేనా? లేక సినీ పరిశ్రమలో రాజకీయాలు, ఒత్తిళ్లు ఈ వివాదానికి మూలమా? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.






