Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కృషి పట్టుదలతో తాను కోరుకున్న పంథాలో కొనసాగుతున్నరు ఆయన. పార్టీ పెట్టిన మొదట్లో చాలా మంది విమర్శలు గుప్పించారు. అన్న చిరంజీవితో పోలుస్తూ ఎన్నో అవమానకర మాటలు అన్నారు. ఒక దశలో పార్టీకి కార్యకర్తలు ఉంటారా? అంటూ విమర్శలు వినిపించాయి. కానీ అదే పార్టీ నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారింది. అటు కేంద్రానికి సపోర్ట్ చేయాలని కూటమిని సైతం కోరింది.
జనసేన పెట్టిన 2014లో పోటీ చేయని పవన్ 2019లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజకీయా గురించి మంచి పట్టు సాధించాడు. ప్రచారం ఎలా ఉండాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలను తెలుసుకోగలి గారు. పార్టీని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలో ముందే పథకం వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైలులో ఉండా పొత్తు అంశాన్ని పైకి తెచ్చి కూటమి పెట్టి అటు బీజేపీ అధిష్టాన్ని ఒప్పించి చాలా సంక్లిష్ట నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దన్న ఆయన ఒక్కగానొక్క సంకల్పం ఫలించింది. ఫలితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
డిప్యూటీ హోదాలో ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ, గజమాలలు, శాలువాలతో సన్మానాలు చేస్తున్నారు. వారి అభిమానం చూరగొన్న పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దారి పొడవుగా నమస్కారం పెడుతూ, పెద్దలు ఎదురుగా వచ్చిన చోటళ్లా వంగుతూ పవన్ కళ్యాణ్ వినమ్రతను చాటుకున్నాడు.