
Pawan Family : ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. సమావేశం అనంతరం ఆయన మోడీని తన ఫ్యామిలీతో కలిశారు. ఆయన భార్య అన్నా లెజీనోవా, కుమారుడు అకీరా నందన్ ను మోడీకి పరిచయం చేశారు.
ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్ తన ఫ్యామిలీని తీసుకెళ్లారు. పిఠాపురంలో తను విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న తన నివాసం వద్దకు పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చిన సందర్భంలో పవన్ భార్య, కొడుకు అకీరా అభిమానులకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపాడు. ఈ పొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ అసెంబ్లీకి 175 సీట్లు ఉండగా, ఇందులో కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా 135 గెలిచింది. లోక్ సభలో 16 సీట్ల గెలుచుకున్న టీడీపీ ఎన్డీయే ప్రభుత్వంలో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. ఇక జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలకం అన్న సంగతి తెలిసిందే.
టీడీపీ 16తో పాటు జనసేన 2 సీట్లు కలుపుకొని 18 సీట్ల మద్దతును ఎన్డీయే కూటమికి ఇచ్చారు. ఇలా రెండు సీట్లు ఇస్తూ కేంద్రంలో ఎన్డీయే కూటమిలో జనసేన కూడా భాగమైంది. జనసేన ఎంపీలకు కూడా కీలక పదవులు దక్కవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెండు సీట్లతో పవన్ ఆ సాహసం చేయడని మాత్రం అంతా అనుకుంటున్నారు.