
TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కీలక సూచన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులలో థర్డ్ పార్టీ ఆన్ లైన్ పేమెంట్స్ అనుమతి ఇవ్వొద్దని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు నుంచి టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్/మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ విద్యుత్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.