
PM Modi – Rahul Gandhi : లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాతో షేక్ హ్యాండ్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓం బిర్లాను అభినందించే సమయంలో పీఎం మోదీ, రాహుల్ గాంధీలు కరచాలనం చేశారు. గాంధీ కుటుంబం నుంచి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మూడో నేతగా రాహుల్ గాంధీ నిలిచారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత ఆయన ఈ ఘనత సాధించారు.
ఓం బిర్లా ఎన్నిక తర్వాత ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ప్రతిపఓ నేత రాహుల్ గాంధీలు ఓం బిర్లాని స్పీకర్ ఛైర్ వరకు తీసుకెళ్లారు. వరుసగా రెండోసారి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నిక కావడంపై పీఎం మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రతిపక్షాలు, ఇండియా కూటమి తరపున ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభినందించారు. ప్రజల గొంతుకకు మీరే మధ్యవర్తా అని, ప్రభుత్వానికి రాజకీయ అధికారం ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతును వినిపిస్తాయని, ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.