
AP Secretariat : ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంపూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా తస్కరణకు, డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్ లు , డేటా హార్డ్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్ లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఏపీలో వైసీపీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. వైనాట్ 175 అన్న ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు కట్టబెట్టారు. అధికారంలోకి వస్తామనుకొని వైసీపీ భంగపడ్డింది. అందులో భాగంగా సచివాలయంలో ఇన్నాళ్లు కీలకంగా మారిన ఐటీ విభాగంలో కీలక డేటా చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సచివాలయంలో తనిఖీలు చేశారు.