పూజాహెగ్డే కెరీర్ ప్రమాదంలో పడనుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఇండస్ట్రీ. ఇప్పటి వరకూ ఆమెకు వరుగా ఆరు ప్లాపులు పడ్డాయి. ఇన్ని వరుస ప్లాపులు ఉన్న హీరోయిన్ గా రికార్డు ఆమె ఖాతాలోనే ఉంది. రాధేశ్యాంతో ఆమె డౌన్ ఫాల్ మొదలైనట్టుంది. ప్రభాస్ తో కలిసి ఈ సినిమాలో నటించారు పూజా హెగ్డే. ఈ సినిమా ప్రేక్షకుల కనీస అంచాలను కూడా నెరవేర్చలేకపోయింది. తర్వాత చిరంజీవితో కలిసి ఆచార్యలో నటించారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత వచ్చిన బీస్ట్, సర్కస్, ఎఫ్-3 వరుసగా బోల్తా కొట్టాయి. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో నటించింది. ఈ మూవీ అన్న తనను కాపడుతుంది అనుకుంది పూజ. కానీ అది కూడా అనుకున్నంత ఆడలేదు. ఈ బాలీవుడ్ సినిమా ప్లాప్ కావడంతో తన ఖాతాలో ఆరో ప్లాస్ సినిమాగా నిలిచింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరెత్తాలంటేనే ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు. ఇప్పటికే మేకర్స్ పూజను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’లో పూజ నటించాల్సి ఉంది. కానీ ఆమెను కాదని శ్రీలీలను తీసుకున్నరు మేకర్స్. ఇక పూజ చేతిలో ఉన్న ఒకే ఒక భారీ ప్రాజెక్టు మహేశ్ బాబు తో చేసే #SSMB28 ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. దీని షూటింగ్ లో కూడా తీవ్ర జాప్యం నెలకొంది.
త్రివిక్రమ్ కు మహేశ్ బాబుకు అస్సలు పడడం లేదట. అందుకే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ ప్రాజెక్టుపై మహేష్ బాబుకు అస్సలు ఆసక్తి లేదట. తన తర్వాతి ప్రాజెక్టర్ రాజమౌళితో చేయనుండడంతో మహేశ్ బాబు ఎక్కువగా దానిపైనే ఫోకస్ పెట్టాడు. ఇక #SSMB28 ఆగిపోతే పూజా హెగ్డే కెరీర్ కు బ్రేక్ పడ్డట్లేనని చిత్ర వర్గాలు గుసగుసలాడుతున్నాయి.