
Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయనున్నాడు. గతంలో ఆదిషురుష్ రిలీజ్ సందర్భంగా ప్రభాసే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించగా.. ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాహుబలి కోసం ప్రభాస్ మూడేళ్లకు పైగా సమయం తీసుకున్నారు. మొత్తం రెండు మూవీస్ కోసం దాదాపు 5 సంవత్సరాలపైనే సమయం వెచ్చించారు.
ఆ తర్వాత ఏడాది, రెండెండ్లకు ఒక సినిమా తీస్తున్న ప్రభాస్.. ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నంలో బిజీ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ లాంటి మూవీస్ చేసినా ప్రభాస్.. సలార్ తో భారీ హిట్ అందుకున్నాడు. సలార్ రెండో పార్టు త్వరలో రాబోతుంది. ఖాన్సార్ రాజ్యం లో ప్రభాస్ ఎలా ఉండనున్నాడో భారీ ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. రాజా సాబ్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ముందుగా రిలీజ్ కానుంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీకి ఓకే చేశాడు. ఈ సినిమా కథ స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేస్తున్నాడు. ఇది రెడీ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
సలార్ రెండో పార్టు ఖాన్సార్ సామ్రాజ్యంలో ఏం జరగనుందో త్వరలోనే తేలనుంది. హనుమ రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. వీటితో పాటు మంచు మనోజ్ నిర్మిస్తూ నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. సలార్, స్పిరిట్, రాజాసాబ్, హనుమ రాఘవపూడి చిత్రం, కల్కి రెండో పార్టు ఇలా అరడజను సినిమాలు చేతిలో పెట్టుకుని ప్రభాస్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ప్రభాస్ మాటంటే మాట అని నిరూపించుకుంటున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.