
Prabhas Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నాయకుడుగా వెలుగొందుతున్నాడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. అలాగే అగ్ర డైరెక్టర్ రాజమౌళి కూడా ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఇద్దరు అగ్ర తారలు కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.. మరి ఈ భేటీ వెనుక కారణం ఏంటి? ఎందుకు వీరు కలుసు కున్నారు..
తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా భేటీ కానున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.. ఈ క్రమంలోనే అమిత్ షా బుధవారం హైదరాబాద్ లోనే బస చేయనున్నారు..
మరి బుధవారం రోజు ఇక్కడే ఉండబోతున్న అమిత్ షా డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ ను కలవనున్నారట.. వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేసినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్ షా మీట్ అవుతూ ఉంటారు.
మరి గతంలోనే అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సమయంలో మిథాలీ రాజ్, ఎన్టీఆర్, నితిన్ వంటి వారిని కలుసుకున్న విషయం తెలిసిందే.. అదే విధంగా ఇప్పుడు పర్యటనలో భాగంగా రాజమౌళి, ప్రభాస్ లను అమిత్ షా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ భేటీ గురించి ప్రభాస్, రాజమౌళి ల నుండి కానీ భాజపా సభ్యుల నుండి కానీ అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరి జూన్ 16న ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కానున్న సమయంలో అమిత్ షా తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది..






