36.5 C
India
Friday, April 10, 2026
More

    తెలంగాణ నుంచే ప్రియాంక పోటీ.. రేవంత్ భారీ స్కెచ్..!

    Date:

    Priyanka Gandhi
    Telangana Congress Meet Priyanka Gandhi

    Priyanka Gandhi Contesting Telangana : యువ సంఘర్షణ సభను విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పథకాలు రచిస్తోంది రేవంత్ సేన. అందుకు తగ్గట్లుగా ఏఐసీసీలో ఛరిష్మా ఉన్న ప్రియాంకా గాంధీని సభకు రప్పించింది. గతంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించగా, ఇప్పుడు ప్రియాంకా గాంధీ యూత్ డిక్టరేషన్ ప్రకటించారు.

    కర్ణాటకలోని ఎన్నికలు ముగియడంతోనే తెలంగాణవైపే ప్రధాన దృష్టి అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ చెపారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నాయకత్వం కూడా వ్యవహరిస్తుంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలని కలలు గంటుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తంపు సంపాదించుకున్న కాంగ్రెస్ ఈ సారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తుంది.

    తెలంగాణలో బండి సంజయ్ సారధ్యంలో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. కాంగ్రెస్ కు మంచి క్యాడెర్ ఉన్నా దాదాపు పదేళ్లు అధికారంలో లేకపోవడంతో నిరాశలో ఉంది. వీరిని బూస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగారు. ఆమె సభకు రావడం.. సీనియర్లతో మాట్లాడడం.. పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సారి ఆమె తెలంగాణ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఏఐసీసీ తెలంగాణ బాధ్యతలను పూర్తిగా ప్రియాంకా గాంధీని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సభ ఒక ఎంట్రీ పాస్ లాంటిదేనని ఇక ఆమె తరుచూ రాష్ట్రానికి వస్తుంటారని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అయితే ఆమె పర్యటనను పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేలా మార్చుకోవాలని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. ఈ సారి ఎంపీ ఎలక్షన్లలో ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ర్టం నుంచి నిలబెట్టాలని ఇక్కడి నాయకులు పావులు కదుపుతున్నారు. వచ్చిన ఆలోచనే తడువుగా హై కమండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

    ఏఐసీసీ ముఖ్య నాయకురాలైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాని అయ్యారు. 1980లో జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ (ఐ) తరుఫున ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ దఫా కూడా ఆమె మనుమరాలైన ప్రియాంకా గాంధీని కూడా తెలంగాణ నుంచే నిలబెట్టి గెలిపించుకోవాలని నాయకులు పావులు కదుపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...