
Punnami Naagu Heroine : తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 80 దశకంలో నటి రతీ అగ్ని హోత్రీ అంటే తెలియని వారుండరూ. చిరంజీవి, కమల్ హసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హిరోలతో నటించింది. బడా దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన పుతీయ వార్ఫిస్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది నటి రతి. ఈ బడా హిరోయిన్ సినిమాలతో పాటు సిరీయల్స్ లో కూడా నటించింది.
ఈ భామ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ’ఉల్లాస పర్వేస్‘ మురట్టుక్కలై, అన్భుకు నాన్ ఆడు, అనే సినిమాల్లో నటించింది. వీటితో పాటు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు టాప్ హిరోయిన్ గా అగ్ర స్థానంలో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమి నాగు సినిమాలో అదరగొట్టింది. ఈమె పూర్తి పేరు రతి అగ్ని హోత్రి కాగా.. 1985 లోనే అనిల్ విర్వానీ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత ఈ సీనియర్ నటి తన కుమారుడితో కలిసి సోషల్ మీడియాలో సందడి చేసింది. రతి తన కొడుకుతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజులు ఏమై పోయారు. ఎక్కడున్నారు. సినిమాలు ఎందుకు చేయలేదు. సీరియల్స్ లో ఎందుకు నటించలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
రతి కుమారుడు తనూజ్ విర్వాన్ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా ఏ మాత్రం వన్నె తగ్గలేదని అంటున్నారు. మిమ్మల్ని ఇలాా చూడటం చాలా ఆనందం గా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికీ ఇలా ఉండటానికి కారణం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక సీనియర్ నటి ఇలా సోషల్ మీడియాలో కనిపించే సరికి చిరంజీవి సరసన నటించింది ఈమెనే తెగ పబ్లిసిటీ చేసేస్తున్నారు.