అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ మూవీకి సీక్వెల్ కూడా వస్తుంది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ జరుగుతోంది. పుష్ప-1 విడుదలై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ గతేడాది రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అక్కడ ఆశించినంత ఆడలేదు. కానీ తన సత్తాను మాత్రం చాటుకుంది. పుష్ప రిలీజైన రోజునే కేరళలో బన్సీ అభిమానులు రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ కూడా సంచలన విజయాలు సొంతం చేసుకుంది ఈ మూవీ.
పుష్ప ఇంతటి విజయం సాధించిన తర్వాత పుష్ప2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ బాగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ భారీగా స్పందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా భారీ ఆఫర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు ఈ సినిమాకు సంబంధించి వివిధ విభాగాల్లో రైట్స్ కొనుగోలు చేసేందుకు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ రేంజ్ మరోసారి బయటపడింది. పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ ఈ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నారు.
ఈ మూవీ ఆడియో హక్కులపై టాక్ బయటకు వచ్చింది. ఆడియో రైట్స్ ను చిత్ర యూనిట్ రూ. 65 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇదో రికార్డ్ అనే చెప్పకతప్పదు. రిలీజ్ కాకుండా రికార్డుల వేటను పుష్ప2 ప్రారంభించిందని అల్లు అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ మాస్ లుక్ కు రష్మీకా మందన లుక్ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అందరూ ఎదురు చూస్తున్న పుష్ప2 2024లో విడుదల చేసేందుకు మేకర్స్ షూటింగ్ వేగాన్ని పెంచారట.