
వైసీపీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. హ్యాష్ టాగ్ల పేరుతో ట్విట్టర్లో తెగ రచ్చ చేస్తున్నారు. వైఎస్ఆర్పీ సారీ రజనీ పేరుతో రచ్చ రచ్చ చేస్తున్నారు. రజనీ అభిమానులు పెట్టిన పోస్ట్ కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా రజనీ ఫ్యాన్స్ పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రజనీ కాంత్ పర్యటించిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. రజనీకాంత్ చంద్రబాబును కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యలే వైసీపీ అధినాయకత్వానికి కోపం తెప్పించాయి. ఇక ఈ ఉత్సవాల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీని కానీ,సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ రజనీ విమర్శించలేదు. కేవలం చంద్రబాబుతో తనకు గల అనుబంధం,ఎన్టీఆర్తో సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబును రజనీని మెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని జగన్ వీర విధేయులు అంబటి, రోజా,కొడాలి నాని రంగంలోకి దిగారు. రజనీని తమ మాటలు,విమర్శల ద్వారా గట్టిగనే అరుసుకున్నారు. రజనీ తమిళనాడులో సూపర్ కావొచ్చు.. ఇక్కడ కాదు..ఏపీ రాజకీయాల గురించి ఆయనకెందుకంటూ ముప్పెట దాడికి దిగారు.
ఇది కాస్తా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది. దీంతో వైఎస్ఆర్సీపీ వైఖరిపై రజనీ అభిమానులు మండిపతున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీని తూర్పారపడుతున్నారు. వెంటనే రజనీకాంత్కు ఆపార్టీ అధినాయత్వం క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు తన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు. అయితే రజనీ ఎన్టీఆర్ జత శయంత వేడుకలకు వచ్చుడేమో కానీ,లేని పంచాయితీని మెడకు చుట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.






