
Upasana delivery : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులవుతున్నారు. ఉపాసనకు రేపు డెలివరీ డేట్ ఇవ్వడంతో మెగా కుటుంబంలో టెన్షన్ మొదలైంది. చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిజేయడంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటులు తల్లిదండ్రులు కాబోతుండటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.
గతంలో చాలా సార్లు ఉపాసన దగ్గర పిల్లల విషయం తీసుకొస్తే తాము ఇద్దరం బిజీగా ఉన్నామని చెప్పేది. వీరి కాపురం పదేళ్లు దాటి పదకొండే ఏట అడుగిడటంతో వారి కలలు నిజమవుతున్నాయి. తమ కుటుంబంలోకి కొత్త అతిథి రావడంతో వారిలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇన్నాళ్లు తామిద్దరమే కానీ ఇప్పుడు ముగ్గురం కాబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు.
దీంతో ఉపాసన అపోలో హాస్పిటల్ లోనే ఉంటోంది. డాక్టర్లు ఈమేరకు ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. డెలివరీ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో ఒక బ్లాక్ మొత్తం ఆమెకే కేటాయించారు. లోపలకు ఒక రామ్ చరణ్ తప్ప ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో తమ వారసుడు వస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
అపోలో గైనకాలజిస్ట్ ఉపాసనను నిరంతరం పరిశీలిస్తున్నారు. రాంచరణ్ కూడా రెండు రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. దీంతో ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉపాసనకు రేపు డెలివరీ డేటు ఇవ్వడంతో అందరు ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన మగబిడ్డకు జన్మనిస్తుందా? ఆడపిల్లను ఇస్తుందా అని అందరిలో ఒకటే టెన్సన్.






