VYOOHAM’ MOVIE TEASER : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి పొలిటికల్ డ్రామా చిత్రం‘వ్యూహం’ టీజర్ను విడుదల చేశారు. ఇది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన సంఘటనల గురించి విపులంగా తీసినట్టు తెలుస్తోంది.. హెలికాప్టర్లో వైఎస్ఆర్ ప్రయాణంతో ప్రారంభమైన టీజర్ పర్వతాలలో క్రాష్ అవుతుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాత్రలో మళ్లీ నటిస్తున్న అజ్మల్ అమీర్ నటించాడు. యోగా చేస్తున్న సమయంలో తండ్రి విషాదకర మరణం గురించి తెలుసుకున్నారు. ఈ వార్త వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందనేలా చూపించాడు. అనంతరం వైఎస్ఆర్ మరణవార్త టీడీపీ శిబిరాన్ని.. చంద్రబాబును ఎలా సంతోషంలో ముంచెత్తింది.. కుట్రలకు దారితీసిందనేది చూపించారు.
హీరోగా అజ్మల్ జగన్ పాత్రలో జీవించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత తన చుట్టూ జరుగుతున్న రాజకీయాలలో ఎలా చిక్కుకుపోతాడో టీజర్ తెలియజేస్తుంది. ఆయనను సిబిఐ అరెస్టు చేసి, చివరకు ఆయన తన సొంత పార్టీ అయిన వైసిపిని కూడా దెబ్బకొట్టిన ఇతివృత్తాన్ని ఈ సినిమా వర్మ చూపించాడు.. అజ్మల్తోపాటు మానస రాధాకృష్ణన్ పోషించిన వైఎస్ భారతి పాత్ర టీజర్లో ఆకట్టుకుంది. అజ్మల్ (జగన్), మానస (భారతి) మధ్య కెమిస్ట్రీ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. నాటి కాంగ్రెస్, చంద్రబాబుకు వ్యతిరేకంగా వీరిద్దరూ ఎలా ఎదిగారన్నది టీజర్ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. .
అయితే సాధారణ నిర్మాణ విలువలతో ‘వ్యుహం’ టీజర్ ఓవరాల్ గా తక్కువ స్టాండర్డ్గా కనిపిస్తున్నాయి. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.