
Ramoji Rao : రామోజీరావు తెలుగు అక్షర కృషీ వలుడు.. ఈనాడు సంస్థల అధినేత, ఈటీవీ, మార్గదర్శి ఇలా అనేక సంస్థలను స్థాపించి లక్షల మంది కుటుంబాలకు, కోట్ల ప్రజలకు దగ్గరయ్యారు. అయినా పత్రికా రంగంలో చేసిన కృషికి పద్మ విభూషణ్ తో సత్కరించింది. తెలుగు సినిమాల నిర్మాణంలో కూడా ఆయన పాత్ర మరువలేనిది. ఈటీవీలో బుల్లితెర సీరియల్స్ ను కూడా ఇలా తీయొచ్చ అని నిరూపించిన వ్యక్తి.
రామోజీ రావు 1978 లో ఒక సినిమాలో నటించారు. యు. విశ్వేశ్వరావు నటించిన ఆ చిత్రంలో న్యాయమూర్తి పాత్ర పోషించారు. తెలుగులో మయూరి లాంటి కళాఖండాన్ని నిర్మించిన గొప్ప మనిషి రామోజీ రావు. పాత్రికేయ రంగంలో ఎన్నో అవార్డులతో పాటు ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన మహా మనిషి. అలాంటి రామోజీ రావు తీవ్ర అస్వస్థతతో జూన్ 7 వ తేదీన హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేరారు. జూన్ 8 తెల్లవారు జామున 4.50 కి తుది శ్వాస విడిచారు.
ఈటీవీ లో పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం స్టార్ట్ చేసి కొన్ని వేల మంది గాయకులకు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప కార్యక్రమాల నిర్వహణ రామోజీ రావు తో నే సాధ్యమయింది. స్వరాభిషేకం లాంటి కార్యక్రమం నిర్వహించి అందులో గొప్ప గొప్ప పాటలు మళ్లీ గాయకులతో పాడించి ఆ పాట ఎలా పుట్టిందో చెప్పిన మహనీయుడు రామోజీ..
కృష్నా జిల్లాలో జన్మించిన రామోజీ పచ్చళ్ల వ్యాపారం నుంచి దేశ ప్రగతిని మార్చే స్థాయికి ఎదిగాడు. పత్రికా, టీవీ రంగాల్లో అనేక వార్తలతో సంచలనాలు సృష్టించారు. రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు ఎవరైనా సరే హైదరాబాద్ వస్తే రామోజీని కలవాల్సిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో ఫైనాన్స్ రంగంలో సరికొత్త ఒరవడిని క్రియేట్ చేశారు.రామోజీరావు మృతి సినీ రంగానికి తీరని లోటు..ఆయన నటించిన సినిమా తెలుసా..
రామోజీరావు తెలుగు అక్షర కృషీ వలుడు.. ఈనాడు సంస్థల అధినేత, ఈటీవీ, మార్గదర్శి ఇలా అనేక సంస్థలను స్థాపించి లక్షల మంది కుటుంబాలకు, కోట్ల ప్రజలకు దగ్గరయ్యారు. అయినా పత్రికా రంగంలో చేసిన కృషికి పద్మ విభూషణ్ తో సత్కరించింది. తెలుగు సినిమాల నిర్మాణంలో కూడా ఆయన పాత్ర మరువలేనిది. ఈటీవీలో బుల్లితెర సీరియల్స్ ను కూడా ఇలా తీయొచ్చ అని నిరూపించిన వ్యక్తి.