
Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి బిజీగా మారిపోయిన హిరోయిన్. పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. పుష్ప లో మంచి క్యారెక్టర్ కొట్టేసిన రష్మిక శ్రీవల్లి గా ఫేమస్ అయింది. పుష్ప 2 లో కూడా ఫుల్ క్యారెక్టర్ తో అలరించనుంది. శ్రీవల్లి ఏడాది మొత్తం డేట్స్ లేనంతా బిజీ బిజీగా మారిపోయింది. పుష్ప 2నే కాకుండా మరో ఆరు సినిమాలకు సైన్ చేసి షూటింగ్ లో కూడా పాల్గొంటుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నుష్ తో కుబేర అనే సినిమాలను చేస్తోంది. దీంతో పాటు పుష్ప 2, గాళ్ ఫ్రెండ్ అనే మూవీ విడుదల కానుంది. దీంతో మరో మూడు నుంచి నాలుగు మూవీలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలకు రష్మిక సైన్ చేసి రెడీగా ఉందంటా.
మొన్నటి వరకు తెలుగులో శ్రీలీల వరుస ఆఫర్లలో దూసుకుపోయి సినిమాల మీద సినిమాలు చేసింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా సరిగా ఆడకపోవడంతో ప్రస్తుతం అవకాశాలు లేక మూలన కూర్చుంది. ఇప్పుడు శ్రీవల్లి వంతు వచ్చింది. ఈ ఏడాది అత్యంత బిజీ హిరోయిన్ గా రష్మిక మారిపోయింది.
వచ్చే ఏడాది రాబోతున్న హిందీ సినిమా సికిందర్, రెయిన్ బో లో నటించబోతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీలో హిరోయిన్ అవకాశాన్ని కొట్టేసింది. హిందీ నటుడు విక్కీ కౌశల్ హిరోగా నటిస్తున్న చావా మూవీలో ఆఫర్ కొట్టేసింది.
యానిమల్ మూవీలో నటించిన రష్మిక యానిమల్ పార్క్ లో కూడా నటించనుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ హిరోగా స్పిరిట్ లో కూడా రష్మికనే హిరోయిన్ గా అవకాశం కొట్టేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా రష్మిక మందన్నా పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం రష్మిక శ్రీవల్లి టాప్ హిరోయిన్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.