RBI Rs. 2000 Note : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 30,2023 లోపు వాటిని మార్చుకోవాలని ప్రజలు అందరినీ కోరింది.
శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ ఇలా పేర్కొంది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క“క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం.. ₹2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.. ₹2000 డినామినేషన్లోని బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయి. ఈ నోటును కలిగి ఉన్న ప్రజలంతా సెప్టెంబర్ లోపు బ్యాంకుల్లో అందించి తిరిగి రూ.500 నోట్లలోపు తీసుకోవాలి. అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు ₹2000 నోట్లకు డిపాజిట్ మార్పిడి సౌకర్యాన్ని అందిస్తాయి.
ఈ చర్యను వివరిస్తూ, ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. “రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి గరిష్టంగా ఉన్న ₹6.73 లక్షల కోట్ల నుండి మొత్తం విలువ ₹3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8% మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణంగా లావాదేవీలకు ఉపయోగించబడదని కూడా గమనించబడింది. ఇతర 500, 100 నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోయేలా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది.
2,000 కరెన్సీ నోట్లను తక్షణమే జారీ చేయడాన్ని నిలిపివేయాలని ఆర్బిఐ అన్ని బ్యాంకులను కోరింది. “ఆపరేషనల్ సౌలభ్యాన్ని నిర్ధారించడానికి , బ్యాంక్ శాఖల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి ₹2000 నోట్లను బ్యాంకు నోట్లలోకి మార్చుకోండి. ఇతర విలువలను మే 23, 2023 నుండి ఏ బ్యాంక్లోనైనా ఒకేసారి ₹20,000/- పరిమితి వరకు రూ.2వేల నోటును మార్పిడి చేయవచ్చు.” అని ఆర్బీఐ సూచించింది.
రూ.1,000 , పాత రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు. ఆర్బిఐ ప్రకారం, ఇతర డినామినేషన్లలో కరెన్సీ తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. అలాగే 2018-19లో రూ.2,000 నోట్ల ముద్రణను ఇప్పటికే నిలిపివేశారు.