24.6 C
India
Thursday, January 23, 2025
More

    AP Volunteers : ఇంటికి రూ.500, మందు సీసా.. పంచింది స్వయంగా వలంటీర్లు..

    Date:

    AP Volunteers
     AP Volunteers

    AP Volunteers : రెండో సారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారు. దీని కోసం అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సిద్ధం’ చివరి సభకు జనసమీకరణ కోసం వలంటీర్ల వ్యవస్థను వైసీపీ యథేచ్ఛగా వాడుకున్నది. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన సభకు వలంటీర్లే దగ్గరుండి ప్రజలను తోలుకొచ్చారు.

    చాలా మంది వలంటీర్లు వారి పరిధిలోని ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్లో ఒకరు కచ్చితంగా సిద్ధం సభకు రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇంటికి రూ.500 చొప్పున ఇచ్చినట్టు పలు గ్రామాల వాసులు చెప్పారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారనే భయంతో వచ్చినట్టు పలువురు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఓ వృద్ధుడు మాట్లాడుతూ.. తన ఇద్దరు పిల్లలు గుంటూరులో ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారని, తన భార్యకు అనారోగ్యమని, వారు వచ్చే అవకాశం లేకపోవడంతో తానే అతికష్టం మీద వచ్చినట్టు చెప్పారు.

    దీన్ని బట్టి సిద్ధం సభకు జనసమీకరణకు వైసీపీ ఎలా ఒత్తిడి తెచ్చిందో తెలుస్తోంది. సభకు హాజరయ్యే వారికి బస్సులో భోజన ప్యాకెట్, మద్యం సీసా ఇచ్చారు. సభా ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి చిందులేయడం కనిపించింది. కొందరికి మత్తు ఎక్కువై అక్కడే పడిపోయారు. మందుబాబుల చేష్టలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్ధం పేరుతో వైసీపీ చేసిన ఆగడాలపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయ్యిందని చెప్పించుకోవడానికి వైసీపీ నానా పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. భయపెట్టి ప్రజలను సభకు తీసుకురావొచ్చు గానీ ఈవీఎం మీటను నొక్కించగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...

    Vijayamma: కొడుకూ, కూతురు మధ్య అగాధాన్ని విజయమ్మ పూడ్చగలదా..?

    Vijayamma: కొన్ని రోజులుగా జగన్, షర్మిల మధ్య ఆస్తివ్యవహారం ఏపీ అంతా...

    YCP : అంతర్యుద్ధంపై వైసీపీలో చర్చ.. వీరి మధ్యనేనా..?

    YCP Mems : అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు భూమిపై...

    YCP : వైసీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

    YCP Ex MLA Resigned : వైసీపీకి మరో షాక్ తగిలింది....