
Salman Khan : ఆసియా కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంగీత్ నిర్వహించారు. ఈ వేడుక కోసం బాలీవుడ్ సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఇండియన్ క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, ఇంటర్నేషనల్ పాప్ సింగ్ జస్టిన్ బీబర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంగీత్ వేడుక వివరాల్లోకి వెళ్తే..
జూలై 5వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ముంబైలోని కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకలో ధోని, కాజల్, ఆలియా భట్ కుటుంబ సమేతంగా హాజరైతే సల్మాన్ ఖాన్, సారా ఆలీ ఖాన్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, పాండే తదితరులు సింగిల్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో అందరూ డ్యాన్సులు వేసి హోరెత్తించారు.
ఈ సంగీత్ వేడుకకు సల్మాన్ ఖాన్ స్టెప్పులు హైలట్ గా నిలిచాయి. అనంత్ అంబానీ ప్రత్యేక వాహనంపై కూర్చొబెట్టి సల్మాన్ ను వేదికపైకి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత సల్మాన్ నటించిన సినిమాల్లోని పాటలపై అనంత్, ఆయన స్నేహితులు ఆయనతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఈ సంగీత్ లో ధోని డ్యాన్స్ కూడా వైరల్ గా మారింది. జుమ్మెకి రాత్ పాటపై ధోని, సల్మాన్, ఇతర క్రికెటర్లు స్టయిల్గా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, అంబానీ ప్యామిలీ వేడుకల్లో జరిగిన సంగీత్ లో సల్మాన్ డ్యాన్స్ కు భారీగా నజరానా ఇచ్చారని బాలీవుడ్లో టాక్. ఈ వేడుకలో స్టెప్పులేసిన పాటకు రూ. 20 కోట్ల వరకు ఇచ్చారనే విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ వేడుకలోనే డ్యాన్స్ చేసిన జస్టిన్ బీబర్కు రూ. 80 కోట్లకుపైగా రెమ్యునరేషన్ ఇచ్చారనేది సమాచారం.