27 C
India
Monday, June 16, 2025
More

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    Date:

    • వేకువ జామున లాంఛనంగా ప్రారంభం – సాయంత్రం సీఎం దంపతులు పుష్కర స్నానం

    Saraswati Pushkaram : కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి, అనగా గురువారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా కలిసే సరస్వతి నదికి బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు వచ్చాయి. ఈ మహాక్రతువు ఈ నెల 26 వరకు కొనసాగనుంది.

    జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం రాత్రి 10.35 గంటలకే గురువు మిథున రాశిలోకి ప్రవేశించి పుష్కరకాలం ప్రారంభమైనప్పటికీ, భక్తులు గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరించాలని కాళేశ్వరం ఆలయ అర్చకులు తెలిపారు. గురువారం వేకువజామున 5.44 గంటలకు సరస్వతి ఘాట్‌ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు.

    సరస్వతి నవరత్న మాల హారతి, ఏర్పాట్లు:

    పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతో పాటు పలు కళా, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేశారు.

    పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్‌ వంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్‌ సిటీని కూడా నిర్మించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి చేరుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. దేవాదాయశాఖ అంచనా ప్రకారం ప్రతిరోజు సగటున లక్షన్నర మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు.

    కాలుష్య నివారణ చర్యలు, పోస్టర్‌ ఆవిష్కరణ:

    పుష్కరాల నేపథ్యంలో నదీ జలాలు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో బుధవారం పీసీబీ అధికారులతో కలిసి మంత్రి సరస్వతి నది పుష్కరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

    ముఖ్యమంత్రి పర్యటన:

    గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. వారు పుష్కర స్నానం ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని కూడా ప్రారంభిస్తారు. గతంలో ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి పుష్కరాలు నిర్వహించినా ఉమ్మడి, తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ పాల్గొనలేదు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కావడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...