
అమెరికాలోని శాన్ డియాగో యూనివర్శిటీ పరిశోధకులు కణాల పెరుగుదల నియంత్రణపై కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. సహజంగా మనిషి శరీరంలోని కణాలు నిత్యం క్షీణిస్తూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు అభివృద్ది చెందుతుంటాయి. అయితే ఈ ప్రక్రియ మనిషి వయస్సు పెరిగేకొలదీ కణాల పుట్టుక,క్షిణత తగ్గుతూ వస్తుంటుంది. ఇది మానవ శరీరం,జీవజాతుల్లో సహజంగా జరిగే ప్రక్రియనే. అయితే ఇందుకు భిన్న పద్ధతులను అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు.
శాన్డియోగో వర్శిటీ శాస్త్రవేత్తలు కణాల పెరుగుదల నిత్యం అలాగే కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానాన్నే వారు ప్రోగ్రామింగ్ రీ ప్రోగ్రామింగ్ అని పిలుస్తున్నారు. మొదటగా ఈప్రక్రియను వారు ఈస్ట్ కణాలపై చేశారు. వాటిపై శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో..ప్రస్తుతం మానవ కణాలపై ప్రోగ్రాం చేస్తున్నారు. కణజాలాల ఏజింగ్ ప్రాసెస్ను రీప్రోగ్రాం చేయడం వల్ల కణాల వయస్సు పెరగకుండా చూడొచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. కణాల వయస్సును పెరగకుండా చేస్తే మనిషి నిరంతరం ఒకేలా ఉంటాడని అంటున్నారు. అయితే వీరి ప్రయోగాలు ఎలా ఉన్నా..ఇలాంటి ప్రయోగాలు ఎలాంటి పెను విపత్తులకు దారి తీస్తాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేసే లాంటి మెథడ్లను అనుసరించడం వల్ల ఏ రకమైన దుష్ఫరిణాలు సంభవిస్తాయోననే ఆవేదన చెందుతున్నారు.






