Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా తన వదిన, జగన్ సతీమణి భారతి రెడ్డి గారి మీద జరిగిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు సుదీర్ఘంగా మహిళలపై జరుగుతున్న ఆవమానకర దాడుల పరాకాష్టగా అభివర్ణించారు. “ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమైనవే. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు కాదు,” అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత జీవితాలను లేని పోని ఆరోపణలతో బలితీసుకునే పద్ధతి సమాజాన్ని అంధకార దిశగా నడిపిస్తోందని హెచ్చరించారు. ఇలాంటి వ్యవస్థకు కారణమైన విధంగా వ్యవహరించిన రాజకీయ పార్టీలను, ముఖ్యంగా వైసీపీ, టీడీపీలను ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. “ఈ విష సంస్కృతికి బీజం వేసింది వాళ్లే. ఇప్పుడు వారే పెంచిన కాలకేయులు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.మహిళల గౌరవం పరిరక్షించేందుకు, వ్యక్తిగత జీవితాలపై దాడులను అరికట్టేందుకు సమాజం మొత్తం పూనుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి…
— YS Sharmila (@realyssharmila) April 11, 2025