36.6 C
India
Friday, April 25, 2025
More

    Silence in AP : కర్ణాటక ఫలితంపై ఏపీలో మౌనం..!

    Date:

    • స్పందించని వైసీపీ, టీడీపీ, జనసేన

      Silence in AP
      Silence in AP, TDP-YSRCP-Janasena

    Silence in AP on Karnataka result : కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించి నాలుగు రోజులవుతున్నా ఏపీలో ఏ ఒక్క పార్టీ నేతలు కూడా దీనిపై మాట్లాడడం లేదు. ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందనా స్పందిస్తే ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని భయపడుతున్నారా.. లేదంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయని భావిస్తున్నారా అనేది తేలడం లేదు.

    అధికార  వైసీపీ నుంచి నో కామెంట్..

    అధికార వైసీపీ కూడా కాంగ్రెస్ విజయంపై ఒక్క మాట మాట్లడడం లేదు. పొరుగున ఉన్న రాష్ర్టంలో అంత పెద్ద ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ విజయం సాధిస్తే కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తమకు చేటు చేస్తుందని భావిస్తుందా.. లేకుంటే ఇప్పటివరకు కేంద్రంలోని పెద్దలతో ఉన్న బంధాలు తెగిపోతాయని భావిస్తుందా అనేది చర్చనీయాంశం. సీఎం జగన్ తో సహా ఏ ఒక్క నేత కూడా కర్ణాటక ఫలితాలపై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.

    టీడీపీ, జనసేనలది అదే తీరు..

    మరోవైపు గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నోరు మెదపలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో తమ పార్టీ పరిస్థితే బాగాలేదు. ఇప్పుడు కేంద్రంతో గొక్కుంటే మొదటికే మోసం వస్తుందని భావించి సైలెంట్ అయ్యారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోపైపు 2024 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే పొత్తుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.

    బీజేపీ కూడా చంద్రబాబుపై నమ్మకం లేకున్నా, రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా ఆయనను చేరదీసేందుకు ప్రయత్నిస్తు్న్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మిన్నుకుండి పోయారని సమాచారం. మరోవైపు బీజేపీతో సత్సంబంధాలు, అలయెన్స్ ఖాయం చేసుకున్న జనసేనాని కూడా కాంగ్రెస్ గెలుపుపై స్పందించలేదు. ప్రస్తుత తరుణంలో ఇది మంచిది కాదని ఆయన భావించి ఉంటారని తెలుస్తున్నది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంతా అంటుంటారు. అగ్రనేతలంతా అన్ని పార్టీలతో సత్సంబంధాలే ఉన్నా కొన్ని కారణాల రీత్యా సైలెంట్ గా ఉండి ఉంటారని టాక్ వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...

    Pawan Kalyan : వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

    Pawan Kalyan : అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు...