
Raj Kasireddy : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.