23.3 C
India
Thursday, January 15, 2026
More

    ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం

    Date:

    The ground is set for early elections in AP
    The ground is set for early elections in AP

    ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పటి వరకు ఎదురు చూడకుండా 2023 ఏప్రిల్ లేదా మే నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే.

    పేరుకు ఏపీ విభజన హామీలపై ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులను కలిసినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ ……. అసలు నిజం వేరే ఉందట. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి మీ అనుమతి కావాలని , మీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు కానీ పార్లమెంట్ లో మీవెంటే ఉంటామని చాలా స్పష్టంగా చెప్పాడట జగన్. గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటోంది జగన్ ప్రభుత్వం. అవసరమైన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ముందు కూడా ఇదే ధోరణి అవలంభిస్తామని , అందుకు మీ ఆశీస్సులు కావాలని మోడీ – షా ద్వయాన్ని కోరినట్లు తెలుస్తోంది.

    ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా తెలుగుదేశం, జనసేన పార్టీలను కోలుకోకుండా చేయాలనే మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడట జగన్. ప్రభుత్వం పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు కాబట్టి ఆ పార్టీలు కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా భారీగా లబ్ది పొందొచ్చన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది.

    ఇక ఇదే సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా చాలాకాలంగా చెబుతున్న మాట ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని. అందుకే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ లతో పాటుగా తెలుగు తమ్ముళ్లు అలాగే టీడీపీ ఎన్నారైలు కూడా భావిస్తున్నారు……. జగన్ ప్రభుత్వం పై కసిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తులో ఉంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాడు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని అంటోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు . కేంద్ర నాయకత్వం అందుకు ఒప్పుకుంటే ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...