20 C
India
Saturday, January 17, 2026
More

    Hiroshima : హీరోషీమాలో మహాత్ముడి విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోడీ..

    Date:

    Hiroshima
    Hiroshima, statue of Mahatma gandhi

    Hiroshima : నేడు ప్రపంచానికే బాస్ ఇండియా. ఇదంతా నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. అందరికీ తెలిసిన సత్యమే ఇది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. అక్కడ హిరోషిమాలో శాంతి కాముకుడు, భారత జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహమే అహింస అన్న ఆలోచనను నలు దిశలా చాటుతుందంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పొటోలను తన ట్విటర్ లో షేర్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ‘అక్కడ ఆవిష్కరించిన ఈ విగ్రహం ప్రపంచానికి గొప్ప సందేహం ఇస్తుంది. గాంధేయ ఆదర్శాలైన శాంతి, సామరస్యం  విశ్వ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయి. మిలియన్ల మందికి శాంతి కోసం ప్రేరణను ఇస్తాయి.’ అని ప్రధాని జపాన్ భాషలో ట్వీట్ చేశారు.

    జీ-7 సమ్మిట్ వార్షిక సదస్సు, మూడో వ్యక్తిగత క్వాడ్ నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మే 19)న జపాన్ లోని హిరోషిమా ప్రాంతానికి వెళ్లారు. ఇందులో ప్రపంచంలోని ఆయా దేశాల అధినేతలతో కలిసి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆ తర్వాత గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి సహా వివిధ రంగాల్లో భారత్-జపాన్ మైత్రిని పెంపొందించే మార్గాలపై ఇరు దేశాధినేతలు మాట్లాడారు.

    ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జరిపిన అణుదాడిలో దాదాపు 1,40,000 మందిని పొట్టనపెట్టుకున్న ‘హిరోషిమా’ అనే పదం వింటే నేటికీ ప్రపంచం భయపడిపోతుందన్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్ వెళ్లినప్పుడు మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించింది. హిరోషిమాలో ఈ విగ్రహం ఏర్పాటు ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తుందని మోడీ అభిప్రాయ పడ్డారు.

    ‘భారత్ పర్యటనకు వచ్చినప్పుడు జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటడం గొప్ప క్షణం, దీని ద్వారా ప్రజలు ఇక్కడకి వచ్చినప్పుడు శాంతి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్నా’  అని భారత ప్రధాని పేర్కొన్నారు. అణుదాడిలో తీవ్రంగా గాయపడింది హీరోషీమా. 6 ఆగస్టు, 1945న ప్రపంచంలోని మొదటి అణుదాడిని ఎదుర్కొవ‌డంతో దాదాపు 140,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న, యునైటెడ్ స్టేట్స్ నాగసాకి నగరంపై ‘ఫ్యాట్ మ్యాన్’ అనే మరొక బాంబు పడింది.  దీనిలో 75,000 మందికి పైగా మరణించారు. యుద్ధకాలంలో అణుబాంబులను ఉపయోగించిన సంఘ‌ట‌న‌లు ఈ రెండు మాత్ర‌మే మాన‌వ చ‌రిత్ర‌లో ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR wife : ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు జపాన్‌లో… ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    NTR wife : ప్రస్తుతం తన తాజా చిత్రం 'దేవర' విడుదల కోసం...

    Tsunami : ప్రపంచంలోని అత్యంత భయంకరమైన సునామీకి 20 ఏళ్లు..!

    tsunami : 2004 సంవత్సరం అదీ.. హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. ఇండోనేషియా...

    Advanced Technology : అడ్వాన్స్ డ్ టెక్నాలజీ దేశంలో బియ్యం కొరత.. అల్లాడుతున్న ప్రజలు

    Advanced Technology : ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇండియా కంటే అడ్వాన్స్...

    scissors : కత్తెర కోసం.. 36 విమానాలు రద్దు.. 200 సర్వీసులు ఆలస్యం

    scissors : జపాన్ లోని అత్యంత రద్దీ ఉండే ఓ విమానాశ్రయంలో...