36.9 C
India
Tuesday, April 21, 2026
More

    తాడిపర్తి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    Date:

    Kethireddy-Pedda-Reddy
    Kethireddy-Pedda-Reddy

    వైసీపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.తాను జగన్ కోసం సర్వం పొగొట్టుకున్నానని,  కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కోసం పని చేసారని గుర్తు చేశారు. జేసీ బ్రదర్స్ పై అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, తనను కానీ, పార్టీ కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని అవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు మన కోసం పని చేసారు, వారికి ఏం చేయాలనే ఆలోచన నేతలకు ఉండాలని చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్ లో ఉనప్పటి నుంచి  వైఎస్ కుటుంబానికి తొలి నుంచి విధేయుడైన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి  చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2019 జేసీ ప్రభాకర్ రెడ్డిపై గెలిచిన రికార్డు నెలకొల్పారు కేతిరెడ్డి. సుదీర్ఘ కాలంగా తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ పైన పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..అధికారులు సహకరించకపోవటం పైన పెద్దారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

    అనంతపురం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచింది. ఉరవకొండ, హిందూపురం మాత్రమే టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యే గా గెలిచిన సమయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సస్ పెద్దారెడ్డి అన్నట్లుగా అక్కడ రాజకీయం కొనసాగుతోంది. అనేక సార్లు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసాయి. పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఈ సమయంలోనే పెద్దారెడ్డి కార్యకర్తల విషయంలో చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చకు దారి తీసాయి.అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ బైఠాయించారు. దంతలపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీని పైన మ్మెల్యే పెద్దారెడ్డి, నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    ఇదే సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తేనే నేతలుగా గుర్తింపు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఎవరు మనకోసం పని చేశారని ఆలోచన ఉండాలని, ఆ ఆలోచన లేకపోతే ఉనికి కోల్పోతారని హెచ్చరించారు. కార్యకర్తలు మద్దతుగా ఉన్నంత వరకే ఎవరైనా నేతలుగా చెలామణి అవుతారని పేర్కొన్నారు. తొలి నుంచి జగన్ కు విధేయుడిగా పేరున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలో చర్చ మొదలైంది. దీని పైన పార్టీ ముఖ్య నేతలు ఏం జరిగిందనే అంశం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India alliance : ఇండియా కూటమిలోకి వైసీపీనట..

    India alliance : అంతన్నారు.. ఇంతన్నారు.. సింహం సింగిల్ గా వస్తుందన్నారు. చివరకు...

    Balineni : బాలినేనికి నచ్చ చెప్తున్న వైసీపీ అధినాయకత్వం.. వరుసగా కలుస్తున్న అధినాయకులు.. మనసు మార్చుకుంటారా?

    Balineni : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

    Anchor Shyamala : రోజా ప్లేసులో యాంకర్ శ్యామల.. కీలక పదవి కట్టబెట్టిన వైసీపీ

    Anchor Shyamala : 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వైఎస్సార్సీపీ...

    Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు

    Jagan Strategy : ఏపీ ఎన్నికలకు ముందు వైనాట్ 175 నినాదంతో...