NTR Satajayanthi – TD Janardhan : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీలోని రాజమండ్రి వేదికగా గోదావరి తీరంలో అట్టహాసంగా ఇవి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీ జనార్ధన్ పాల్గొన్నారు. ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సభ నిర్వహణలో కీరోల్ గా నిలిచారు.
టీడీ జనార్ధన్ సభ నిర్వహణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. టీడీపీ అధికారం కోసం పాటు పాడుతామని అందరిలో భరోసా నింపారు.
Ublood App Founder, జైస్వరాజ్య టీవీ చైర్మన్ డా. జై యలిమంచిలి గారిని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా టీడీ జనార్ధన్ కలిశారు. ఈ సందర్భంగా యూ బ్లడ్ సేవలు తెలుసుకున్న జనార్ధన్.. డా. యలమంచిలి జగదీశ్ సేవలను పొగిడారు. తెలుగుదేశం పార్టీ తరుఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామని.. దీనిపై కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. కలిసికట్టుగా ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షను ఇద్దరూ వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా యూబ్లడ్ సేవలను విస్తరించాలని.. మీ సేవలు అమోఘం అని డా. జై యలిమంచిలి గారి జనార్ధన్ కొనియాడారు. మీలాంటి వారు ప్రజాసేవలోకి రావాలని.. మరింతగా సేవ చేయాలని.. ఇందుకు తమ తోడ్పాటును అందిస్తామని జనార్ధన్ గారు స్వయంగా యలిమంచిలి గారిని ఆహ్వానించారు.