36.9 C
India
Tuesday, April 21, 2026
More

    TDP : అమరావతిపై టీడీపీ సైలెంట్

    Date:

    • కొంత కాలంగా నోరు మెదపని సైకిల్ పార్టీ
    • ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మక అడుగులా..?
    TDP
    TDP

    TDP is silent on Amaravati : అమరావతి తమ రాజధాని అని నిన్న మొన్నటి వరకు హోరెత్తించిన టీడీపీ నేతలు కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. రైతుల ఆందోళనలకు బాహాటంగా మద్దతునిచ్చిన ఆ పార్టీ కొన్ని రోజులుగా ఆ పదాన్నే ఉచ్చరించడం లేదు. దీని వెనుక రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు వ్యూహాత్మక మౌనం ఏంటో తెలియక టీడీపీ శ్రేణులు తికమక పడుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, అమరావతి అంశం కొంత పక్కకు పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఆధిష్ఠానం భావిస్తున్నదనే ప్రచారం వినిపిస్తున్నది.

    అమరావతి.. అపవాదు రాష్ర్టంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, అమరావతిపైనే గతంలో టీడీపీ దృష్టి పెట్టింది. రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేసింది. ఐదు కోట్ల ప్రజల కలల రాజధానిలా కడుతామని ఢంకా బజాయించి మరి చెప్పింది. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. తమ పార్టీ శ్రేణులు, అనుయాయులకు లబ్ధి చేకూరేలా అమరావతి నిర్ణయం జరిగిందని నాటి ప్రతిపక్షం ఆరోపించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కథ కంచికి చేరింది.

    అమరావతిలో వైసీపీ మార్క్ రాజకీయం

    కాగా అమరావతిలో భూములను పేదలకు పట్టాలు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవడంతో టీడీపీ రాజకీయాన్ని మొదలుపెట్టింది. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా చేసి స్టే తెచ్చింది. కానీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇక పంచాయతీ ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం పట్టాల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. త్వరలోనే విచారణ జరుగనుంది. కాగా, పేదలకు ఇండ్లను అడ్డుకుంటున్నదనే అపవాదును టీడీపీపై వేసింది వైసీపీ. దీనిని తిప్పకొట్టడంలో టీడీపీ అధిష్ఠానం విఫలమైంది. ఈ విషయంలో టీడీపీ కలుగజేసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో కలుగజేసుకుంటే మొదటికే ముప్పు వస్తుందని భావిస్తున్నది. అందుకే అచితూచి వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే టీడీపీ అమరావతి అంశంపై ప్రస్తుతం తెరచాటు రాజకీయాలు చేస్తున్నదని, బహిరంగంగా మాట్లాడడం లేదనే ప్రచారం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Amaravati : రూ.లక్ష కోట్లతో అమరావతి 2.0

    Amaravati : ప్రధాని నరేంద్ర మోడీ నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Chebrolu Kiran : జగన్ ఫ్యామిలీపై కామెంట్స్.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ ఆదేశాలు

    Chebrolu Kiran : వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...