
TDP Victory Rally : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కొలువుదీరింది. 175 అసెంబ్లీ సీట్లకు కూటమి 164 సాధించింది. ఇందులో 135 సీట్లతో టీడీపీ విజయదుందుభి మోగించింది. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కాగా.. కూటమిలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నిన్న (జూన్ 14)న శాఖల కేటాయింపు ముగియడంతో మంత్రులు చార్జి కూడా తీసుకున్నారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రవాసులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇలా విదేశాలలో సైతం సంబురాలు, ర్యాలీ తీయడం ఒక్క టీడీపీ వల్లే సాధ్యం అవుతుంది. ఇతర స్థానిక పార్టీల విషయంలో ఇది సాధ్యం కాదు. ఇదంతా పక్కన పెడితే కెనెడాలో ప్రవాసులు సంబురాలు చేసుకున్నారు.
కెనడాలోని మిసిసాగా, ఒంటారియోలోని మిస్సిసాగా సెలబ్రేషన్ స్క్వేర్, 300 సిటీ సెంటర్ డ్రైవ్, మిసిసాగా వద్ద టీడీపీ విజయోత్సవ ర్యాలీ తీశారు. ఆర్గనైజింగ్ కమిటీలో మధు చిగురుపాటి, రావు వఝా, సాదా గద్దె, కోటేశ్వరరావు పోలవరపు, అనిత బెజవాడ ఉన్నారు.
తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో తాము శక్తికి మించి పోరాడినట్లు వారు చెప్పారు. తెలుగుదేశానికి పదే ఒక్క ఓటును కూడా మిస్ చేసుకోవద్దని వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని ఏపీకి వెళ్లి ఓటు వేసివచ్చినట్లు ఎన్ఆర్ఐలు తెలిపారు. ప్రస్తుత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని నారా చంద్ర నాయుడు నాయకత్వంతో రాబోయే సంవత్సరాల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని అందుకే తాము బాబు గెలుపునకు కృషి చేసినట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రవాసులు కెనెడాలో విజయోత్సవ ర్యాలీలు, అన్నదానాలు, సంబురాలు చేసుకుంటున్నారన్నారు. ర్యాలీలలు నిర్వహించడంలో సహకరించిన APNRT డాక్టర్ రవి వేమూరు గారు, అతని బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎన్ఆర్ఐలు చెప్పారు.