
తెలుగుదేశం, జనసేనాల మధ్య పొత్తులు ఖరారై.. సీట్ల పంపకాలు కూడా జరుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంత వరకు బాగనే ఉన్నా జనసేన మిత్రపక్షమైన బీజేపీ ఎటువైపు వెళ్తుంది అని అసక్తి నెలకొంది. తెలుగుదేశం, జనసేనల కూటమిలో బీజేపీ చేరుతుందా. లేక ఒంటరిగా పోటీ చేస్తుందా తేలాల్సి ఉంది.
చంద్రబాబు మాత్రం కమ్యూనిస్టులను బూచిగా చూపెట్టి బీజేపీని దారికి తెచ్చకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ కలిసి వస్తే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిపి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని, బీజేపీ కలిసి రాకుంటే టీడీపీ, జనసే, కమ్యూనిస్టులతో కలసి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం దక్షణ భారతదేశంలో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ర్టం కర్టాటక.. ఈ సారి ఎన్నికల్లో ఓడిపొతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కర్ణాటకపై ఏపీ ప్రభావం బాగానే ఉంటుంది. అందువలన చంద్రబాబుతో బీజేపీ లేదు. కర్టాటక తర్వాత బీజేపీ ఆశలు ఉన్న రాష్ర్టం తెలంగాణ ఈ యేడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ అంతగా ప్రభావం చూపే పరిస్థితి లేదని ఆయన భావన. బీజేపీతో తెలుగుదేశం పొత్తు లేదు కాబట్టి తెలుగుదేశం ఓట్లు బీజేపీ పడే అవకాశాలు లేవు . అందువలన ఈ సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఈ ఎన్నికల తర్వాత కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని వేచి చూసే ధోరణిలో బాబు ఉన్నారని సమాచారం.
2024 ఎన్నికల్లో బీజేపీకి ఈసారి సీట్లు తగ్గే అవకాశాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్లు అవసరం పడే అవకాశం ఉంటుంది. బలమైన మిత్రపక్షం కోసం వేచి చూస్తున్న బీజేపీ తమతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివస్తుందని పవన్ తో భేటీలో బాబు చెప్పినట్లు వినికిడి.






