
Teachers fight : ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యవస్థ. భావి పౌరులను, ఆదర్శవంతంగాతయారు చేసే మార్గదర్శకులు వారు. విద్య వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో అలాంటి విలువలు కనుమరుగవుతున్నాయని చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరమని మరికొందరు కోరుతున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి అభాసుపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపైనే ఉందని పలువురు వాపోతున్నారు..
అయితే ఇక్కడ ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాళ్లు తన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలిని కొట్టారు. చివరకు చెప్పులతో కూడా కొట్టుకున్నారు.బిహార్ లోని ఓ పాఠశాలలో తలెత్తిన వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. పాట్నాలోని కొరియా పంచాయతీ విద్యాలయంలో కాంతి కుమారి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలోని ఓ తరగతి గది కిటికీ విషయమై ఇద్దరు టీచర్లతో కాంతికుమారికి వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి ఆ ఇద్దరు టీచర్లు కాంతికుమారిపై దాడి చేశారు. కింద పడేసి కొట్టారు. చెప్పులతో కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మరికొందరు కాసేపటికి వారిని విడదీశారు.
బాధ్యతగా మెలగాల్సిన టీచర్లు ఇలా విద్యార్థుల మీద బాహబాహీకి దిగడం వివాదస్పదమైంది. ప్రస్తుతం ఈ ఘటన పాట్నా జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బిహార్ తో పాటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు టీచర్లపై ట్రోల్స్ కొనసాగుతున్నాయి. మరికొందరు వారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మార్గదర్శకులుగా నిలవాల్సిన వాళ్లే ఇలా బహిరంగంగా తన్నుకోవడం సరికాదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు అంటున్నారు. మరోవైపు వారిపై చర్యలకు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది.
#WATCH | Principal of a government school in Uttar Pradesh’s Lakhimpur thrashed a female teacher with shoes
(Source: Viral video) pic.twitter.com/hCRiMuVsgV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 24, 2022