
Hyderabad-Kuala Lumpur Flight : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమంలో సిబ్బంది తో పాటు 130కి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారు. విమానం టెకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు.
అయితే ఫ్లైట్ లో ఇంధనం ఎక్కువగా ఉండడంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించిన అధికారులు దాదాపు 3 గంటల పాట విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టించారు. 12.45 గంటలకు టెకాఫ్ అయిన ఫ్లైట్ ను 3.58 గంటలకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.