Telangana EAMCET Results : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు గురువారం (మే 25) రోజున విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 9.30 గంటలకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్ 86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రిజల్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే మొదటి స్థానాలు సాధించారు. ఇంజినీరింగ్ టాప్ 10, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ టాప్ 10 లో ఏడుగురు వారే ఉన్నారు.
ఎంసెంట్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 94,589 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 20,743 మందితో కలిపి మొత్తం 1,15,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,01,544 మంది హాజరవగా 13,788 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు 91,935 మంది. ఉత్తీర్ణతా శాతం 86, అందులో బాలురు 84, బాలికలు 87 శాతంగా ఉంది.
ఇక ఇంజినీరింగ్ విభాగంలో చూసుకుంటే.. పరీక్ష రాసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 1,53,890 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 51,461 మందితో కలిపి మొత్తం 2,05,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,95,275 మంది హాజరవగా 10,076 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు 1,57,879 మంది. ఉత్తీర్ణతా శాతం 80గా ఉంది. ఇందులో బాలురు 79, బాలికలు 82 శాతంగా ఉంది.
ఇంజినీరింగ్ టాపర్లు
సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
ఎక్కింటిపాని వెంకటమణిందర్ రెడ్డి (గుంటూరు)
చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
మాజేటి అభినీత్ (కొండాపూర్)
పొన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి)
మారదాన ధీరజ్ కుమార్ (విశాఖపట్నం)
వడ్డే శాన్వితా రెడ్డి (నల్గొండ)
అగ్రికల్చల్ అండ్ మెడిసిన్ లో టాపర్లు
బూరుగుపల్లి సత్యారాజ జశ్వంత్ (తూ.గో జిల్లా)
నశిక వెంకటతేజ (చీరాల)
పఫల్లక్ష్మి పసుపులేటి (సరూర్ నగర్)
దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
దేవగుడి గురుశశిధర్ రెడ్డి (హైదరాబాద్ )
వంగీపురం హర్షిల్ సాయి (నెల్లూరు)
రిజల్ట్స్ తెలుసుకునేందుకు
http://www.results.manabadi.